![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-36 లో... గంగ సడెన్ గా నిద్రలేచి ఇషిక అన్నమాటలు గుర్తు చేసుకొని ఇంట్లో ఉండొద్దని నిర్ణయం తీసుకుంటుంది. పెద్దసారు ఇంకా శకుంతల దగ్గరికి వెళ్లి వాళ్ళ కాళ్ళు మొక్కి బయటకు వస్తుంది. అదంతా ఇషిక, వీరు చూసి మన ప్లాన్ సక్సెస్ అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే నా మనిషికి ఫోన్ చేసి గంగని కిడ్నాప్ చేయమంటానని వీరు అంటుంటే.. ఇప్పుడు ఎందుకు? అది ఎటు వెళ్లినా తిరిగి తన బస్తీకే కదా వెళ్ళేది అని ఇషిక అంటుంది.
ఆ తర్వాత గంగ వెళ్తుంటే రుద్ర ఉంటాడు. తనని చూసి ఆగిపోతుంది. నిన్ను ఎంతో ఇష్టపడే మా పెద్దమ్మ పెద్దనాన్నని మోసం చేసి వెళ్తున్నావా.. మీ అమ్మ గురించి నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో.. నేను మా పెద్దమ్మ గురించి అంతే ఆలోచిస్తాను. మీ అమ్మని వెతికి తీసుకొస్తాను.. నన్ను నమ్ము నాపై నమ్మకం లేకపోతే నువ్వు వెళ్ళు అని గంగకి చెప్పి రుద్ర లోపలికి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత పైడిరాజు దగ్గరికి వీరుమనిషి వచ్చి మా బాస్ దగ్గర డబ్బు తీసుకున్నావ్ కదా.. తిరిగి తీసుకొని రమ్మన్నాడని అతను చెప్పగానే నా దగ్గర అంత డబ్బు ఎక్కడిదని పైడిరాజు అంటాడు.
మరుసటిరోజు గంగ కోసం చూస్తుంది శకుంతల కానీ ఎక్కడ కన్పించదు.. ఇల్లు వదిలి వెళ్లిందేమోనని ఇషిక అంటుంది. నా మాట లెక్కచెయ్యకుండా వెళ్ళిపోయిందన్న మాట అని రుద్ర అనుకుంటాడు. అప్పుడే పైడిరాజు ఇంటిముందుకి వచ్చి నా కూతురు ని నాతో పంపించండని గొడవ చేస్తాడు.
తరువాయి భాగంలో లాయర్ పెద్దసారు దగ్గరికి వచ్చి.. రుద్ర సర్ ది ఫైనల్ హియరింగ్ ఉందని చెప్తాడు. ఒకవేళ రుద్ర తప్పు చేశాడని తెలిస్తే ఎలా అని పెద్దసారు అడుగుతాడు. పది నుండి పన్నెండు సంవత్సరాల శిక్ష అని లాయర్ అంటాడు. శకుంతల గారు కేసు వాపస్ తీసుకుంటే ఇదంతా ఏం ఉండదని లాయర్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |